ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 12 మంది మృతి

-

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల మోతమోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని తెలిపారు. రాజధాని కీవ్‌లోని క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేసిందని చెప్పారు.

ఈ దాడుల్లో తన సొంతపట్టణమైన క్రివ్వీ రీహ్‌లో ఆరు ఇల్లు ధ్వసమయ్యాయని జెలెన్‌స్కీ తెలిపారు. దీంతో ఓ వ్యక్తి మరణించాడని చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న మోల్డోవాలో కూడా క్షిపణులు పడ్డాయని ఆ దేశ అధ్యక్షురాలు మైయా స్యాండు ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news