భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

-

భారత జట్టు ఆగస్టు నెలలో ఐర్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. అన్ని మ్యాచ్లు మలాహిడే స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి.

భారత జట్టు బిజీగా ఉన్నప్పటికీ…ఐర్లాండ్ కోసం సమయం కేటాయించినందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపింది. ఇక అటు ఐసీసీ 2023 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. తాజాగా ఐసిసి దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. పదేళ్ల తర్వాత జరిగే ఈ ప్రపంచకప్ వన్డే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news