10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు: మంత్రి సబిత

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో పదివేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. మండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.

“మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.7,289.54 కోట్లతో మూడు విడతల్లో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదువుపాయాలను కల్పించనున్నాం. తొలి దశలో 9,123 పాఠశాలల్లో జూన్ కల్లా పనులను పూర్తి చేస్తాం. రెండు, మూడు విడతల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణం పై దృష్టి సారిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే, టీచర్ల బదిలీలతో మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉంటే, బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని ప్రకటించారు. కొత్త టీచర్లు వచ్చే వరకు వారు అక్కడే కొనసాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ టీచర్ లేని పాఠశాల ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news