మొత్తానికి కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..!

-

తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సావిత్రి సౌందర్య తర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తపడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ముఖ్యంగా తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే తన ప్రతి సినిమాలో కూడా కచ్చితంగా ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ..

సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తరువాత కూడా ఎన్నో సినిమాలు చేసింది. అంతేకాదు తెలంగాణ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకొని శభాష్ అనిపించుకుంది. గత ఏడాది లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్ వంటి చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత విరాటపర్వం సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు కానీ ఈమెకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.

ఇకపోతే ఆ తర్వాత సాయి పల్లవి వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రం గార్గి జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది సాయి పల్లవి. ఇక ఆమె పూర్తిగా సినిమాలకు దూరం కాబోతోంది అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా ఎంపిక అయిందని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ లో విగ్నేష్ శివన్ డైరెక్షన్లో అజిత్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా నుంచి డైరెక్టర్ విగ్నేష్ ను తప్పించడంతో నయనతార కూడా తప్పుకుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. మొత్తానికి అయితే సాయి పల్లవి ఒక కొత్త సినిమాను ప్రకటించింది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news