“డబ్బులు దోచుకోడానికే స్కిల్ డెవలప్ మెంట్ స్కీం తీసుకొచ్చారా”

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందన్న కేసులో సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపైన టీడీపీ వర్గాలు మరియు చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వైసీపీ నాయకులు మరియు ప్రభుత్వ పెద్దలు మాత్రం అన్నీ పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ జరిగిందని చెబుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ఈ స్కిల్ డెవెలప్మెంట్ గురించి మరియు చంద్రబాబు గురించి కీలక కామెంట్స్ చేశాడు. ఈయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కేవలం డబ్బును అడ్డగోలుగా దోచుకోవడం కోసమే ఈ స్కీం ను తీసుకువచ్చారంటూ ఆరోపించారు సజ్జల.

ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను 2014 లో ఏర్పాటు చేశారు.. ఈ సంస్థకు గంటా సుబ్బారావును సీఈఓ గా నియమించారు.. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీం వచ్చింది యువత పేరుతో డబ్బును దోచుకోవడం కోసమే అంటూ కుండబద్దలు కొట్టారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news