ఏపీ కేబినెట్​లో త్వరలోనే మార్పులు : సజ్జల కీలక ప్రకటన

-

అమరావతి : ఏపీ కేబినేట్‌ విస్తరణపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గుర్తు చేశారు.

త్వరలోనే ఏపీ కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమేనని.. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటామని తెలిపారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడని తెలిపారు.

ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అని ప్రశ్నించారు. ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు.. తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని మోసం చేయాలి.. భ్రమపెట్టాలి అనుకున్న వారే ముందస్తుకు వెళ్తారని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news