విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే ఏడ్చేశాను : స్టార్ హీరోయిన్ సమంత

-

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత విజయదేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పింది. మాములుగా సమంతకు ఐపీఎల్ లో ఫేవరెట్ టీం చెన్నై అని మరియు ఫేవరెట్ ప్లేయర్ ధోని అని చెప్పింది. అయితే ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం మాత్రం ఎందరిలోనో స్ఫూర్తిని కలిగించింది అని చెప్పాలి. వ్యక్తిగత జీవితంలో సమంత ఈ మధ్య ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల నుండి ఎలా మీరు మళ్ళీ మాములుగా అయ్యారు అని అడిగిన ప్రశ్నకు.. ఆమె నవ్వుతూ క్రికెట్ లో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో దాదాపుగా మూడు సంవత్సరాల నుండి ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేదు. దీని వలన ఎందరు విరాట్ ను విమర్శించారో మనము చూశాము.

అంతమాత్రాన విరాట్ క్రికెట్ ఆడడం ఆపలేదు.. సెంచరీ కొట్టే వరకు ఆడుతూనే ఉన్నాడు. ఒకరోజు సెంచరీ చేసినప్పుడు నేను కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. లైఫ్ లో అదొక్కటి చాలు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చు అని చెప్పగానే యాంకర్ షాక్.

 

Read more RELATED
Recommended to you

Latest news