చంద్రబాబు అనే గజదొంగ ప్రజలను మోసం చేస్తున్నాడు – మంత్రి మేరుగ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి మెరుగు నాగార్జున. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అనే గజదోంగ కొన్ని దొంగ మీడియాలను అడ్డు పెట్టుకోని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు మాయలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దళితుల అభివృద్ధి, దాడుల మీద బహిరంగ చర్చకు సిద్ధం అంటూ చంద్రబాబుకి సవాల్ విసిరారు మంత్రి మేరుగ.

రాష్ట్ర ప్రజలకు ఇంటింటికి నేనున్నాను అనే ముఖ్యమంత్రి దోరికాడని అన్నారు. చంద్రబాబు ప్రజలను కల్లబోల్లి మాటలతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చదువును అంగండి సరుకులాగా కార్పరేట్ స్కూల్స్ కి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలలో మరోసారి వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news