బ్లాక్ అండ్ వైట్లో తన సోయగాలతో మతులు పోగొడుతున్న సమంత..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయగల సత్తా ఉన్న లేడీ సమంత అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకు సౌత్ కి మాత్రమే పరిమితమైన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. నార్త్ హీరోయిన్స్ కి సౌత్ లో మార్కెట్ లేదు.. తమిళ్, మలయాళం హీరోయిన్స్ కి కూడా నార్త్ లో మార్కెట్ లేదు.. అటు నార్త్, ఇటు సౌత్ ను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్న సమంత హాలీవుడ్ లో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.

తన మార్కెట్ ని మరింత ఎక్స్పాండ్ చేస్తున్న సమంత అందుకు శాకుంతలం సినిమానే ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనారోగ్యం నుంచి ఇప్పుడు కంప్లీట్ గా రికవరీ అయిన ఈమె ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న శాకుంతలం సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యింది. తన సినిమాను ప్రమోట్ చేయడానికి పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ఇస్తూ సమంత సోషల్ మీడియాలో మూడు ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో బ్యూటీ ఇన్ బ్లాక్ అనిపించే రేంజ్ లో సమంత ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

త్వరలోనే సమంత గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాని ముంబైలో కలవనుంది . తన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ కోసం సమంత, ప్రియాంక చోప్రా కలవనున్నారు.. ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా శాకుంతలం మూవీ గురించి మాట్లాడితే నార్త్ లో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు వీరిద్దరూ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత టాలెంట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news