సౌత్ , నార్త్ చిత్రాలపై కీలక కామెంట్లు చేసిన సమంత..!

-

తాజాగా లేడీ స్టార్ హీరోయిన్ సమంత ఉత్తరాది దక్షిణాది చిత్రాలపై కీలక కామెంట్లు చేయడమే కాదు ఈ రెండు సినీ రంగాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి కూడా వెల్లడించింది.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ సమీపిస్తున్నందున శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత ఇండియాలో ప్రస్తుతం సినిమాల ట్రెండ్ గురించి.. ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఈ రోజుల్లో ఉత్తరాది చిత్రాలకు దక్షిణాది చిత్రాలకు మధ్య అడ్డుగోడలు లేవు ఇప్పుడు అన్ని భాషలకు చెందిన చిత్రాలను ఆడియన్స్ చూస్తున్నారు.. ఇక శాకుంతలం పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్ళిన సమంత అక్కడ న్యూస్ ఏజెన్సీ ఏ ఎన్ ఐ తో మాట్లాడుతూ.. ఈ విషయాలు వెల్లడించింది. ఉత్తరాది , దక్షిణాది చిత్రాలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి చర్చలకు తావివ్వడం తమకు ఇష్టం లేదన్న సమంత.. ఒక నటి గా అన్ని భాషల చిత్రాలలో పని చేయగలగడం తనకు ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.

ఇక అభిమానులు కూడా తమ సొంత భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా తెరకేక్కిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది దుష్యంత మహారాజుకు భార్యనే ఈ శకుంతల పురాణాలలో ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం.. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను గుణ టీం వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news