సమంత పెళ్లికి ముందే ఆ వ్యాధి బారిన పడిందా..!

-

ముఖంపై చిన్న మొటిమ వచ్చినా దాచేయాలని చూస్తాం. అదే సమస్య పెద్దదైతే.. బాధ, కుంగిపోవడం… తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం. కానీ వెండితెరను ఏలుతోన్న తారలు… ఆరోగ్య సమస్యలు ఎదురైన వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. అయినా వాటిని దాయాలనుకోలేదు. ధైర్యంగా అందరి ముందుకూ వచ్చి చెబుతున్నారు. వాటితో పోరాడుతూ… ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షుకును మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందం, నటనతో అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. మొదటి సినిమాలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనుకోని కారణాల వలన వారు విడిపోయారు. అప్పటి నుంచి సామ్, చైకి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతూనే ఉంది.

అయితే వరుస సినిమాలతో బిజి బిజిగా గడుపుతున్న సమంతకు ఓ సమస్య ఉండేదట. చాలా ఏళ్లు ఆ సమస్య వల్ల తీవ్ర ఒత్తిడి, భాదకు గురైందట. అందం, ఫిట్‌నెస్‌లకు సమప్రాధాన్యమిస్తుంది సమంత. ఒకప్పుడు తనకు పీఎల్‌ఈ (పాలీమార్ఫస్‌ లైట్‌ ఎరప్షన్‌) అనే చర్మసమస్య ఉండేది. ఎండకి విపరీతమైన దురద, దద్దుర్లతోపాటు తీవ్రమైన నొప్పి. కెరియర్‌ తొలినాళ్లలో.. అదీ పెద్ద అవకాశాలు వస్తున్నప్పుడు ఈ సమస్య ఎదురైంది. రెండేళ్లు ఎన్నో ఇబ్బందులూ పడింది. కొన్ని సినిమాలూ చేజారాయి. చికిత్స తీసుకొని, ఆ సమస్య నుంచి బయటపడింది సామ్‌.

ఈ ఏడాది ప్రారంభంలో మానసిక సమస్యకు గురైనట్టు చెప్పింది. ‘సమస్య ఏదైనా చికిత్స తప్పనిసరి. సమయమూ పడుతుంది. ఓపిక పట్టాలి. చికిత్స, చుట్టూ ఉన్నవాళ్ల ప్రోత్సాహంతో బయటపడటం తేలికే’ అంటుంది.

ఇక, సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news