” సంహారిణి ”  భ‌య‌పెడుతుందా…?

-

శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం  ” సంహారిణి ” 1980.  లో ఒక రాజు కుటుంబంలో జరిగే కథ  2019 లో కూడా కొనసాగుతుంది. హారర్, కామెడీ. థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు.  రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించారు, అలాగే రాజు పాత్రలో తమిళ సీనియర్ నటుడు నటించాడు.

ఈ పాత్ర పేరు రాజ బహుదూర్ విజయేంద్ర వర్మ. ఈ చిత్రాన్ని బెంగళూర్, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేసారు.  విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్  తో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో సందర్భానుసారం మూడు పాటలు ఉన్నాయి.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news