బిగ్ బ్రేకింగ్ : ఇండియాలో మొత్తం ఆరు కొత్త కరోనా కేసులు గుర్తింపు

-

ఇండియాలో కొత్త కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. ఇండియాలో మొత్తం ఆరు కొత్త కరోన కేసులు నమోదయినట్టు చెబుతున్నారు. UK తిరిగి వచ్చిన వ్యక్తుల యొక్క 6 శాంపిల్స్ ఈ కొత్త కరోనాకు సానుకూలంగా ఉన్నట్లు కనుగొనబడింది. నిమ్హాన్స్ బెంగళూరులో 3 కేసులు, సిసిఎంబి హైదరాబాద్ లో 2, పూణేలోని ఎన్ఐవిలో 1 కేసు నమోదయినట్టు గుర్తించారు.

వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి కి కరోనా స్ట్రెయిన్ గుర్తించారు. కుటుంబ సబ్యులకు సైతం టెస్ట్ లు చేసి జీన్ మ్యాప్ కోసం సీసీఎంబీ కి శాంపిల్స్ పంపారు. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింత గా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇవ్వాళ కొత్త కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు వద్దు అని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news