నీ మోచేతి నీళ్ళు తాగి..ఎమ్మెల్యే కాలేదు..పొంగులేటిపై సండ్ర సీరియస్‌

-

మా రెక్కల కష్టం తో ఎమ్మెల్యే అయ్యాం తప్ప నీ మోచేతి నీళ్ళు తాగి కాదని .పొంగులేటిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీరియస్‌ అయ్యారు. ఖమ్మం కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో బిఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. అభివృద్ది ఫలాలు పొందిన మనం గొంతు విప్పాలి.. ప్రభుత్వాన్ని ఓడిద్దమన్న పెద్దలకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు.

ఏం తప్పు చేశామని అసెంబ్లీ గేట్లు తాకనివ్వరు.. నేను ఎమ్మెల్యే గా అయినప్పుడు నీ పరిస్థితి ఎంటి అని పొంగులేటిపై నిప్పులు చెరిగారు. ప్రజల్లో ఉండే ప్రజా ప్రతినిధులు కావాలా లూటీ చేసే నాయకులు కావాలా అన్నారు. గతం లో జలగం వెంగళరావు,తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్దిని నేను కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. మన ఓట్ల తో ఎంపీగా గెలిచి, ఈ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించారు సండ్ర. తలబిరుసు తనంతో విమర్శలు చేసే వాళ్లకు అవకాశం కలించవద్దు.. తెలంగాణ వచ్చాక అభివృద్దిని చూడాలని కోరారు సండ్ర.

Read more RELATED
Recommended to you

Latest news