క్రీడాభిమానులకు షాకింగ్ న్యూస్…. టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్

-

స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు చేదు వార్త చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది.

దేశంలో పేరు సంపాదించుకున్న మహిళా క్రీడాకారుల్లో సానియా మీర్జా ఒకరు. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. 2001 లో సానియా మీర్జా తన కెరీర్ ను ప్రారంభించింది. తన కెరీర్లో ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలు సాధించింది.

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో పెళ్లి చేసుకుంది. 2018లో ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తమ బిడ్డకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరును కూడా పెడుతున్నట్లు గతంలో షోయబ్ మాలిక్ ప్రకటించారు. ఇదిలా ఉంటే దేశానికి, క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషన్ అవార్డ్ను పొందింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news