సర్కారు వారి పాట మొదలయిపోయింది…

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు నుండీ జరుగుతూనే ఉన్నాయి.

కరోనా కారణంగా చిత్రీకరణ ఇప్పటి దాకా మొదలు కాలేదు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ విషయాన్ని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ప్రకటించాయి. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది కూడా. చూడాలి మరి సినిమా షూట్ ఎప్పటికి పూర్తీ చేస్తారు అనేది.

Read more RELATED
Recommended to you

Latest news