సీఎం జగన్ కు సర్పంచ్ బహిరంగ లేఖ

-

ఏపీ సీఎం జగన్‌ కు ఓ గ్రామ సర్పంచ్‌ బహిరంగ లేఖ రాశారు. రోడ్ల సమస్యలపై ఈ లేఖలో గ్రామ సర్పంచ్‌ లేఖ లో పేర్కొనగా… వెంటనే సీఎం జగన్‌ కూడా స్పందించారు. వెంటనే అధికారులు రహదారి మరమ్మతులను చేపట్టారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పి. గన్న వరం మండలంలోని గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు వేయాలని బెల్లంపూడి సర్పంచ్‌ బండి మహాలక్ష్మి కోరారు.

ఈ మార్గంలోని రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని.. గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్‌ మహాలక్ష్మి.. సీఎం జగన్‌ కు లేఖ రాశారు. ఇంకేం ఈ ఉత్తరం సీఎం దృష్టికి వెళ్లింది. వెంటనే సీఎం ఓ కార్యాలయం ఈ ఉత్తరం పై స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను రిలీ్‌ చేసింది. దీంతో పి. గన్నవరం నుంచి గంటి పెదపూడి వరకు వెళ్లే రహదారి మరమ్మతులను అధికారులు చేపట్టారు. అంతేకాదు.. త్వరలోనే టెండర్లు వేసి రోడ్లు నిర్మిస్తామని సర్పంచ్‌ మహాలక్ష్మికి అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news