సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్‌.. ఏం జ‌రిగిందంటే..

-

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ చలో హుజూర్ నగర్ కార్యక్రమం నేపథ్యంలో హుజూర్ నగర్ కు బయలుదేర‌గా అదృశ్యమయ్యారు. ఆయ‌న జాడ ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌లేదు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం చలో హుజూర్ నగర్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేయాలనే నిర్ణయించారు. ఈ క్ర‌మంలోనే సౌదాని శుక్రవారం హైదరాబాదు నుంచి హుజూర్ నగర్ కు బయలుదేరారు.

అయితే శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల టైమ్‌లో ఓ స్తానిక నేతకు భూమన్న ఫోన్ చేశారు. టోల్ గేట్ వద్ద తమను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఫోన్ చేసి చెబుతుండగానే ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా కార్యకర్తలకు చేరవేశారు. దాంతో అక్క‌డ ప్రాంతాల‌న్నీ స్థానిక నాయకులు ఆరా తీసినా కూడా సౌదాని భుమ‌న్న జాడ తెలియ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news