రేవంత్… నీ పార్టీ పాతాళంలోకి పోకుండా కాపాడుకోవాలి – తెలంగాణ మంత్రి

-

రేవంత్… నీ పార్టీ పాతాళంలోకి పోకుండా కాపాడుకోవాలంటూ చురకలు అంటించారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే కేంద్రం తో కొట్లడాలని…సమ్మక సారలమ్మ, మేడారం అభివృద్ధి గురించి రేవంత్ మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. ములుగును గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. నీతో నడుస్తున్న ఆ నలుగురు కూడా ఎన్నికల దాకా ఉండేలా చూసుకో అంటూ రేవంత్ కు చురకలు అంటించారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌.

తెలంగాణలో గిరిజన యూనివర్సటీ ప్రతిపాదన లేదని పార్లమెంట్ లో మోడీ సర్కార్ చెప్పడం దుర్మార్గమని..తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారన్నారు. గతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలనలో ఉందని గతంలో పార్లమెంట్ లో చెప్పారని..గిరిజన యూనివర్సిటీ కి ములుగు లో భూమిని రాష్ట్ర సర్కార్ ప్రతిపాదించిందని తెలిపారు. అయిన ఇప్పటికీ తెలంగాణ లో గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఏర్పాటు చేయలేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news