రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి స్పందించిన సాయిధరమ్ తేజ్..!

-

సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. ఆ ఘటన జరిగిన 6 నెలల తర్వాత మొదటి సారిగా మీడియా కు తన మనసులో ఉన్న ఆలోచనలను వక్తం చేసారు. సాయి ధరమ్ తేజ్ తనకు ౩ కుటుంబాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మొదటగా తాను ప్రమాదానికి గురైన సమయమంలో హాస్పిటల్ లో చేర్చిన సయ్యద్ అబ్దుల్ ఫరక్ ను గుర్తు చేస్తూ అతనికి ధన్యవాధాలు తెలిపారు. మీ వల్లనే నేను ఇంకా బ్రతికి ఉన్న అని అన్నారు.

 

 

 

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మీరే అని ఫరక్ ని పొగిడారు. మెడిక్యూర్ హాస్పిటల్ లో చూసుకున్న స్టాఫ్ కి అలాగే అపోలో లో ట్రీట్ చేసిన డాక్టర్ లకు ధన్యవాధాలు తెలిపారు. తర్వాత మెగా స్టార్ ఫామిలీని, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ని, బన్నీని, గుర్తు చేస్తూ ఇది నా మొదటి ఫామిలీ అని, సినీ ఇండస్ట్రీ లోని నటి నటులను గుర్తు చేసుకుంటూ వారు తన రెండో ఫామిలీ అని చెప్పుకొచ్చారు. చివరిగా ఫాన్స్ ను గుర్తు చేస్తూ, తాను హాస్పిటల్ లో ఉన్నపుడు పూజలు చేసిన అభిమానులు తనకు దేవుళ్లతో సమానం అని చెప్పు కొచ్చారు. అభిమానులే తన మూడో కుటుంబం గా చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news