రూ.10వేల కంటే ఎక్కువ డబ్బు డ్రా చేయాలంటే.. ఓటీపీ ఉండాల్సిందే

-

ఇక నుంచి రూ.10వేల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ నమోదు చేయాల్సిందే. ఈ నియమం ప్రస్తుతం ఎస్​బీఐ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది.

ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే, వినియోగదారులు తప్పనిసరిగా ‘బ్యాంకులో నమోదైన మొబైల్‌ నంబరు’కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.

తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువమొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news