సీనియర్ సిటిజన్లకు స్టేట్ బ్యాంక్ శుభవార్త..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్​ సిటిజన్లకు గుడ్ ​న్యూస్ చెబుతోంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ వీకేర్​ సీనియర్​​ సిటిజన్స్​ టర్మ్​ డిపాజిట్​ స్కీమ్ గడువుని ఎక్స్టెండ్ చేసింది. దీనితో సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 2022 మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని స్టేట్ బ్యాంక్ అంది. మాములుగా అయితే ఈ స్కీమ్ గడువు సెప్టెంబర్ 2020 వరకే ఉండేది.

 

SBI
SBI

కానీ కరోనా కారణంగా దీనిని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. ఎక్కువ మంది సీనియర్​ సిటిజన్లు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈసారి గడువుని పెంచింది. ఇది ఇలా ఉంటే సీనియర్​ సిటిజన్లు స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్ ద్వారా చక్కటి లాభాలని పొందొచ్చు. వారి ఫిక్సిడ్​ డిపాజిట్లపై సాధారణ పౌరుల కంటే 0.80 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే, నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది.

ఇక ఎఫ్​డీపై సీనియర్​ సిటిజన్లకి ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. స్టేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన ఈ స్పెషల్​ ఎఫ్‌డి స్కీమ్ కింద ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు డిపాజిట్​ చేస్తే 30 బేసిస్​ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల వ్యవధి గల ఎఫ్​డీపై కేవలం 5.4% వడ్డీ రేటు ఇస్తోంది. అదే, సీనియర్ సిటిజన్ స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్​ కింద డిపాజిట్ చేస్తే, 6.20% వడ్డీ రేటు వస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుండి వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news