విశాఖ గ్యాస్ లీక్.. 50 కోట్ల పంపిణీపై స్టే..!

-

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో విశాఖ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నడుస్తున్న వారు నడుస్తూనే.. నిద్రపోతున్న వారు నిద్రలోనే కుప్పకూలిపోయారు. ఈ దృశ్యాలు చూసి చలించని గుండె లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరణించినవారికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే బాధితులకు కూడా ప్రకటించింది. అయితే తాజాగా.. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం విచారించింది. పిటిషన్ కు సంబంధించి అదనపు పత్రాలను సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు కోర్టు అనుమతించింది. అంతేకాదు, ఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ. 50 కోట్లపై ఇప్పడే పంపిణీ చేయవద్దని ఆదేశించింది. రూ. 50 కోట్ల పంపిణీపై మధ్యంతర స్టే కొనసాగుతుందని తెలిపింది. ప్రమాదంపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version