ఎలక్షన్ కోడ్ వల్లే స్కీంలు ఆగిపోయాయయి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ పై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చాక కేవలం కేసిఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెరిగాయని,కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు చెంప దెబ్బ కొట్టారని అన్నారు .జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని స్కీంలు ఆగిపోయాయని ఆయన తెలిపారు.

రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే మోడీ ఆపించారని చెప్పారు. ఎలక్షన్ అయిపోగానే ఖచ్చితంగా బ్యాంకర్లతో మాట్లాడి రుణమాఫీ చేస్తామని అన్నారు. బీజేపీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రజా సేవ చేయడానికే వంశీ వస్తున్నారని కాకాకు అండగా ఉన్నట్టే వంశీకి ఉండి గెలిపించాలని కోరారు వివేక్ వెంకటస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news