BREAKING : మంత్రి అప్పలరాజుకు భద్రత పెంపు

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి అప్పలరాజుకు భద్రత పెంచింది. మంత్రి సీదిరి అప్పలరాజుకు సెక్యూరిటీని పెంచుతూ ఏపీ ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.

ఈ మేరకు అదనంగా నలుగురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రి సిదిరి అప్పలరాజును హెచ్చరిస్తూ మావోయిస్టుల లేక విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాల సిఫారసు మేరకు నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే మంత్రి సీదిరి అప్పలరాజు భద్రత కోసం నలుగురు గన్ మెన్ లు, నలుగురు సివిల్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా అదనంగా మరో నలుగురు సివిల్ పోలీసులను నియమించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news