ఇంద్రవెల్లి సభ కి లక్షమంది వస్తారు: సీతక్క

-

మంత్రి సీతక్క ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని దేవతలను దర్శించుకోవడం జరిగింది ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఇక్కడి నుండి జరగబోతుందని అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా మొదటి టూర్ ఇంద్రవెల్లి నుండే ప్రారంభించారని చెప్పారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి బహిరంగ సభ ఉంటుందని చెప్పారామే.

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అమరవీరుల స్మృతి మనం ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేస్తారు రేవంత్ రెడ్డి అని సీతక్క చెప్పారు. సీఎం కి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుండి మొదలు పెడతామని చెప్పారు ఇంద్రవెల్లి సభకి లక్ష మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news