ప్రిన్స్ మ‌హేష్‌బాబుకు త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్!

-

ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన సీనియ‌ర్ హీరోయిన్లు.. మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల‌కు త‌ల్లి, అక్క పాత్ర‌ల‌తో పాటు అత్త వంటి పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు తాజా గా మ‌రో హీరోయిన్ కూడా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. 1990లో చిరంజీవి, బాల‌కృష్ణ వంటి అగ్ర హీరోల‌తో ఆడిపాడిన హీరోయిన్ రాధ.. ఒక సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్రిన్స్ మ‌హేశ్ బాబు 28వ సినిమా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే.

కాగ ఈ సినిమాలో ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ రాధ న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివ‌స్ సీనియ‌ర్ హీరోయిన్ రాధ ను క‌లిసినట్టు స‌మాచారం. క‌థ వినిపించిన‌ట్టు తెలుస్తుంది. కాగ రాధ కూడా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు గ‌త నెల ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ పెట్టిన నెల రోజుల త‌ర్వాత రాధ సినిమా క‌న్ఫామ్ అయిన‌ట్టు తెలుస్తుంది. అలాగే ఇటీవ‌ల జీ తెలుగు లో ఒక డ్యాన్స్ షోలో కూడా రీ ఎంట్రీపై రాధ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఎది ఏమైనా.. ఈ సీనియ‌ర్ హీరోయిన్ మ‌రో సారి టీవీల్లో క‌నిపించ‌బోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news