ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత..!

-

ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూసారు. రామాయన్ సీరియల్ తో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు అరవింద్ త్రివేది (83) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా త్రివేది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. గుజరాతి, హిందీ భాషలలో 300కు పైగా సినిమాల్లో నటించి ఆయన ప్రేక్షకులను అలరించారు.

అరవింద్ త్రివేది 1980లో ప్రసారమైన రామాయన్ సీరియల్లో రావణుడి పాత్రలో నటించారు ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ రావన్ పాత్ర అంటే గుర్తుకు వచ్చే విధంగా ఆ పాత్రలో త్రివేది జీవించారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ త్రివేది రాణించారు. 1991లో పార్లమెంటుకు ఎన్నికైన త్రివేది 1996 వరకు ఎంపీగా సేవలు అందించారు. ఇక ఆయన మరణం పై పలువురు ప్రముఖులు మృతికి సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news