పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

-

రహదారిపై మరోమారు నెత్తురోడింది. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలో గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని లోయలో పడిపోయాయి. కారు, బస్సు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికలు ఉన్నారు. ప్రమాదంలో కారు డ్రైవర్ మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పరస్థితి విషమంగా ఉంది. కారు స్పీడ్ గా రావడంతో తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళ్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news