బిగ్ బాస్ నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు.. శిరోముండనం అంటూ !

-

ఏపీలో శిరోముండనం కేసులు, బాధితులు ఎక్కువ అయిపోయాయి. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా గురించి సమాచారం ఇచ్చిన దళిత యువకుడికి పోలీసులే శిరోముండనం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడికి సినీ నిర్మాత, దర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్, ఇప్పుడు ఒక ప్రముఖ ఛానెల్ కి సీఈఓగా వ్యవహరిస్తున్న నూతన్ నాయుడు సిబ్బంది శిరోముండనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

విశాఖ పట్నంలోని నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలలుగా పని చేస్తున్న దళిత యువకుడు శ్రీకాంత్ మానేశాడు. అయితే తమ ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం నేరం మోపి శ్రీకాంత్ ను నూతన్ నాయుడు సిబ్బంది,కుటుంబసభ్యులు వేధించినట్టు సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడు. శ్రీకాంత్ వారి మాటలు వినకపోవడంతో నూతన్ నాయుడు సిబ్బంది గుండు గీయించి, భౌతిక దాడులకు దిగినట్టు చెబుతున్నాడు. తనను చాలా ఘోరంగా దాడి చేశారని, సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే అసలైన వాస్తవాలు బయటకు వస్తాయని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన శ్రీకాంత్, పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version