పృథ్వీ గురించి బయటకు వస్తున్న సంచలన విషయాలు…!

-

హాస్యనటుడు, ఎస్వీబీసి చైర్మన్ పృథ్వీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండే ఆయన, ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పార్ట్ టైం ఉద్యోగినితో ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనితో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వినపడుతుంది.

ఇక ఎస్వీబీసి ఉద్యోగులు ఆయన రాసలీలల వ్యవహారాలకు సంబంధించి మరిన్ని విషయాలను బయట పెట్టె అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయన ఆడియోని ఉద్యోగులు బయటపెట్టగా ఎస్వీబీసి గౌరవ అధ్యక్షులు మురళి, పృథ్వీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన పద్మావతి గెస్ట్ హౌస్ లో కూర్చుని మద్యం సేవించే వారని ఆయన ఆరోపించారు. ఆయన రాసలీలకు అంతే లేదని ఆయన విమర్శించారు.

ఇక పదవిని అడ్డం పెట్టుకుని పృథ్వీ కాస్త అతిగా ప్రవర్తించే వారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయన బాధిత మహిళలు సంస్థలో చాలా మందే ఉన్నారని అంటున్నారు. ఆయన సినిమా డైలాగులతో సంస్థలో అసభ్యంగా మాట్లాడే వారని ఉద్యోగులు అంటున్నారు. త్వరలోనే ఆయన్ను పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. ఆయన డబ్బులు డబ్బులు తీసుకుని 35 మందికి ఉద్యోగాలు ఇచ్చారని దీనిపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news