థాంక్యూ ధోని.. ఇక సెలవు..!

-

ఇటీవల ఐపీఎల్ సీజన్ పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తర్వాత సీజన్లో ప్రక్షాళన చేయడానికి జట్టు యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ గా కొనసాగుతున్న షేన్ వాట్సన్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సహచరులకు ఫ్రాంచైజీకి కూడా చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తో తనకున్న మూడేళ్లు అనుబంధంపై ఇటీవలి వాట్సన్ స్పందించాడు. తనపై నమ్మకం ఉంచిన జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ కి… కృతజ్ఞతలు తెలిపాడు షేన్ వాట్సాప్. 2019 సీజన్లో విఫలమైనప్పటికీ తనను తుది జట్టులో నుంచి తప్పించుకోలేదు అంటూ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు .

Read more RELATED
Recommended to you

Latest news