Shardul Thakur : గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శార్దూల్ ఠాకూర్

-

టీమిండియా క్రికెటర్లు ఒక్కక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా… టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి మిథాలీ పార్కులర్‌ ను వివాహం ఆడబోతున్నారు శార్దూల్‌ ఠాకూర్‌. అత్యంత సన్నిహితుల మధ్య ముంబై లో ఈ జంట ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఆదివారం ఈ ఎంగేజ్మెంట్‌ వేడుక జరిగినట్లు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌ గా మారాయి.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా.. జరుగనున్న టీ 20 వరల్డ్‌ కప్‌ ముగిసిన అనంతరం వీరిద్దరి వివాహం జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే… మిథాలీ పార్కులర్‌ – టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక వేడుకకు భారత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై రంజీ సహచరులు ధవల్ కులకర్ణి, అభిషేక్ నాయర్, ఠాకూర్ పాత స్నేహితులు హాజరయ్యారు. కాగా… శార్దూల్‌ ఠాకూర్‌.. చివరి సారిగా 2021 టీ 20 వరల్డ్‌ కప్‌ ఆడాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ సిరీస్‌ కు దూరంగా ఉన్నాడు టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌.

Read more RELATED
Recommended to you

Latest news