షర్మిల తెలంగాణలో మోడీ ఏజెంట్ – ఎమ్మెల్సీ పల్లా

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై కీలక ఆరోపణలు చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్. క్రైస్తవులను నాశనం చేసే వారితో షర్మిల జట్టు కట్టిందన్నారు. వైయస్ షర్మిల తెలంగాణ లో మోడీ ఏజెంట్ అన్నారు పల్లా. షర్మిల కు అవసరం అయిన సహకారం బిజెపి అందిస్తోందన్నారు. బిజెపి ఎలా చెబుతుందో…వైయస్ షర్మిల అలా చేస్తుందని ఆరోపించారు.

మైనార్టీలకి కెసిఆర్ అన్ని రకాలుగా గౌరవం ఇస్తున్నారని తెలిపారు. మోడీ దేశంలో మైనార్టీలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళతో షర్మిల కలిసిందన్నారు పల్లా రాజేశ్వరరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిజెపికి, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకమన్నారు. వైయస్ బిడ్డ అని చెప్పుకునే అర్హత షర్మిల కు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news