గుజరాత్ లో 7వ సారీ బిజెపి గెలుపును వైయస్సార్సీపి జీర్ణించుకోవడం లేదు – చింతల రామచంద్రారెడ్డి

-

గుజరాత్ లో ఏడవ సారి బిజెపి గెలుపును వైఎస్సార్సీపీ జీర్ణించుకోవడం లేదన్నారు బిజెపి నేత చింతల రామచంద్రారెడ్డి. చిన్న రాష్ట్రాల తోనే అభివృద్ధి అనేది బిజెపి జన సంఘ్ ల ఆలోచన విధానం అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తేవడం కెసిఆర్ – జగన్ ఆడుతున్న నాటకం అని మండిపడ్డారు. ఎన్ని నాటకాలు ఆడిన తెలంగాణ లో వచ్చేది బిజెపి యే అన్నారు చింతల.

జన సంఘ్ లో, బిజెపి లో అత్యధిక మెజారిటీ తో గెలిచిన రాష్ట్రం గుజరాత్ అని తెలిపారు. వేములవాడ రాజా రాజేశ్వర దేవాలయానికి నాలుగు వందల కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. “కొమురవెల్లి మల్లన్న, భద్రాద్రి రామాలయాల అభివ్రుది ఏది. కొండగట్టు అభివృద్ధి ప్లాన్ ఏమైనా చేశారా. కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయో జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలి. లిక్కర్ స్కాం లో ఎవరు ఉన్నారో బయటకు వచ్చింది. సీఎం ఎందుకు స్పందించడం లేదు. అదానీ, అంబానీ లు మా పాలన లో వచ్చారా. హిమాచల్ లో బిజెపి ఓట్ల శాతం చూడండి” అన్నారు చింతల.

Read more RELATED
Recommended to you

Latest news