రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు రైతు ఆత్మహత్య వార్త కనిపించలేదా? – షర్మిల

-

కామారెడ్డి రైతు ఆత్మహత్యపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు రైతు ఆత్మహత్య వార్త కంటికి కనిపించలేదా? అని ఫైర్ అయ్యారు.

 

నెల రోజుల నుంచి కామారెడ్డి పట్టణ రైతులు ఆందోళన చేస్తుంటే మున్సిపల్ మంత్రికి ఒక్క పేపర్లో వార్త దొరకలేదా?ఒక రైతు ప్రాణాలు విడిస్తే తప్ప మీ సర్కారు స్పందించదా? అని నిలదీశారు షర్మిల.

 

ఇండస్ట్రియల్ జోన్ కు పచ్చటి భూములే దొరికాయా? మీ దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా? ఇంకెంత మంది చనిపోతే మీ కండ్లు చల్లబడుతయని ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ,రైతులకు న్యాయం చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదన్నారు షర్మిళ.

Read more RELATED
Recommended to you

Latest news