మోడీ తెలంగాణకు వస్తే.. కేసీఆర్ పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నాడు? – షర్మిల

-

సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటనపై వైఎస్‌ షర్మిల స్పందించారు. మోడీ తెలంగాణకు వస్తే.. కేసీఆర్ పిల్లిలా ఎందుకు దాక్కుంటున్నాడు? అని నిలదీశారు షర్మిల.

తెలంగాణ రాష్ట్ర సమస్యలపై, విభజన హామీలపై మోడీ గారిని ప్రశ్నించే దమ్ము లేదా? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించాలని వైయస్ఆర్ రూ.10వేల కోట్ల రుణాల రద్దు చర్యలు తీసుకున్నారు. వైయస్ఆర్ బతికే ఉంటే 13 ఏండ్ల కిందనే ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేదని చురకలు అంటించారు.

రామగుండం MLA సొంత లాభం కోసమే KCRకు అమ్ముడుపోయిండు. మూడు కబ్జాలు.. ఆరు కాంట్రాక్టులు అన్నట్లుగా రెండు చేతులా సంపాదనట. ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల వద్ద రూ.లక్షలు వసూలు చేశాడట. వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేకు కర్రుకాల్చి వాత పెట్టాలె అంటూ స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news