బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి శివసేన

-

సుశాంత్ సింగ్ మృతి తెచ్చిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ అంతా డ్రగ్స్ వ్యవహారంలో వణికి చస్తోంటే మరో పక్క రాజకీయంగానూ ఆయన చావు ప్రకంపంలే సృష్టిస్తోంది. బీహార్ లో 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశమున్నట్లు శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశం మీద మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

బిహార్‌ లో తాము కనీసం 50 స్థానాల్లో బరిలోకి దిగాలని నేతలు కోరుకుంటున్నారని అయితే దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంజయ్‌ పేర్కొన్నారు. బిహార్‌ లో సమస్యలే లేవనుకుంటే అక్కడ ఏయే సమస్యలున్నాయో పార్సిల్‌ ద్వారా పంపిస్తామని ఆయన అన్నప్పుడే ఇలాంటి ఎదో ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు ఫిక్స్ అయిపోయారు. ఈయన కామెంట్స్ తో క్లారిటీ ఇచ్చినట్టు అయింది. అలానే బిహార్‌ మాజీ డిజీపీ గుప్తేశ్వర్‌ కి పోటీగా అభ్యర్థిని నిలబెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన ఆ సమాధానాన్ని దాటవేశారు.

Read more RELATED
Recommended to you

Latest news