టీమిండియాకు షాక్.. ఐసీసీ మెన్స్ టీ20 టీం ద‌క్క‌ని చోటు

-

టీమిండియా కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ విడుద‌ల చేసిన టీ 20 టీమ్ ఆఫ్ 2021 లో టీమిండియా కు చెందిన ఆట‌గాళ్లుకు ఎవ‌రికీ కూడా చోటు ద‌క్క‌లేదు. ఇది భార‌త క్రికెట్ చ‌రిత్ర లోనే ఘోర అవ‌మానం. కాగ ఐసీసీ ప్ర‌తి ఏడాది ఉత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన 11 మంది ఆట‌గాళ్ల తో ఒక టీం ను ప్ర‌క‌టిస్తుంది. అయితే ప్ర‌తి ఏడాది ఐసీసీ దీ బెస్ట్ మెన్స్ టీ 20 టీం లో భార‌త ఆట‌గాళ్లు ఉంటారు. కానీ తాజా గా ఐసీసీ ప్ర‌క‌టించిన టీ 20 లో భార‌త్ కు చెందిన ఆట‌గాళ్లు ఎవ‌రూ లేక పోవ‌డం భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే అవ‌మాన‌క‌రం.

కాగ పాకిస్థాన్ నుంచి ఏకంగా ముగ్గురు ఆట‌గాళ్లు ఐసీసీ ప్ర‌క‌టించిన మెన్స్ టీ 20 లో ఉన్నారు. అంతే కాకుండా ఈ టీం కు కెప్టెన్ గా బాబ‌ర్ ఆజ‌మ్ ను ఐసీసీ ప్ర‌క‌టించింది. అలాగే కీప‌ర్ గా మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ను కేటాయింది. అలాగే ఆట‌గాళ్లు గా జోష్ బ‌ట్ల‌ర్, మార్క్ర‌మ్, మిచెల్ మార్ష్, మిల్ల‌ర్, హ‌స‌రంగ, షంసీ, హేజిల్ వుడ్, ముస్తాఫిజుర్ ర‌హ్మెన్, షాహిన్ అఫ్రిది పేర్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news