ఆ వెటకారపు నవ్వే ఆరుగురి ప్రాణాలు తీసింది ?

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పెందుర్తి మండలం జుత్తాడ ఆరు మర్డర్ల కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక నవ్వు ఆరుగురిని చంపేలా చేసిందట. నిన్న వేకువజామున పాలు తీసుకోవడానికి వెళుతున్న అప్పలరాజును విజయ్ భార్య చూసి వెటకారంగా నవ్విందట. ఈ విషయాన్ని అప్పలరాజు విచారణలో వెల్లడించారు. విజయ్ భార్యతో పాటు, విజయ్ తండ్రి బమ్మిడి రమణ కూడా అప్పలరాజు ను చూసి వెటకారంగా నవ్వడంతో అవమానంగా భావించిన అప్పలరాజు వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న విజయ్ భార్యను నరికి చంపాడు అప్పలరాజు. ఆమె కేకలు వేయడంతో బయటకు వచ్చిన విజయ్ తండ్రి రమణ, అప్పలరాజు చేతిలో కత్తి చూసి ఇంట్లోకి పరుగులు పెట్టి దాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డం వచ్చిన విజయ్ అత్త, చిన్న అత్తలను అప్పలరాజు నరికిన సమయంలో వాటి చేతిలో పిల్లలు ఉండడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తర్వాత బాత్రూంలో దాక్కున్న బమ్మిడి రమణను కత్తితో దాడి చేసి చంపాడు అప్పలరాజు. 2018లోనే విజయ్ మీద అప్పలరాజు కుమార్తె రేప్ కేసు పెట్టినట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉండడంతో వివాదాలు మొదలైనట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news