కత్తి మహేష్ మరణంపై పవన్ ఫ్యాన్స్ ను ఉతికారేసిన శ్రీరెడ్డి

-

కత్తి మహేష్ మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న శ్రీరెడ్డి(Sri Reddy) క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అనంతరం టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాత కొడుకు తనను ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడని ఆరోపలులు గుప్పిస్తూ…. ఫొటోలను కూడా రిలీజ్ చేసింది. అంతే కాకుండా శ్రీ రెడ్డి మీడియా ఎదుట చేసిన అర్ధనగ్న ప్రదర్శనను ఎవరూ మరిచిపోలేరు . ఇది చూసిన చాలా మంది హవ్వా అసలు తాను ఆడ పిల్లేనా అంటూ కామెంట్లు కూడా చేశారు. ఇలా ఫేమ్ తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనంతరం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబీకుల మీద చేసిన విమర్శలతో ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని ఓ ఆటాడుకున్నారు. చెప్పడానికి కూడా వీల్లేని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు ఏ మాత్రం బెదరని శ్రీ రెడ్డి వారిని మరింత రెచ్చగొట్టింది.

శ్రీరెడ్డి /Sri Reddy
శ్రీరెడ్డి /Sri Reddy

 

ఇలా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి… తమిళనాడులో ఉంటున్నా.. కూడా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్లు, వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతాయి. తాజాగా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మరణం పై కూడా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్లు చేసింది. కత్తి మహేశ్ కూడా పవన్ కల్యాణ్ ను ఆయన స్థాపించిన జన సేన పార్టీని అనేక రకంగా తిడుతూ… సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయనను కూడా వేధించారు. ఇప్పుడు ఆయన మరణించడంతో కొంత మంది పవన్ ఫ్యాన్స్ తమ హీరోను తిట్టినందుకే ఇలా అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో శ్రీ రెడ్డి సంచలన కామెంట్లు చేసింది. పవన్ ఫ్యాన్స్ ను సోషల్ మీడియా వేదికగా బుర్ర లేని వెదవల్లారా ఎందుకురా పోజులు కొడతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news