BREAKING : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడి

-

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఊహించని షాక్‌ తగిలింది. నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. కళాశాల ప్రిన్సిపాల్ , ఉస్మానియా విసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని.. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. అయితే, వారిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. తోపులాటలో పలువురు విద్యార్థుల కు గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news