Sircilla: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కేటీఆర్

-

ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అంతే కాకుండా కుటుంబీకులను కేటీఆర్ పరామర్శించారు. వారికి తక్షణ సాయం కింద బీఆర్ఎస్ పార్టీ తరఫున 50వేల రూపాయలు కేటీఆర్ ఆ కుటుంబానికి అందజేశారు.నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయంకు సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు.

కాగా, ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు అని తెలిపారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు అని అసహనం వ్యక్తం చేశారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news