BREAKING : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నిక

-

సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన జాతీయ మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరో మేరకు ఈ నిర్ణయం తీసుకుంది సిపిఎం పార్టీ అధిష్టానం. ఈ సమావేశాల్లో చివరి రోజైన ఆదివారం.. పార్టీ జాతీయ కార్యదర్శిగా ఏచూరి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం ఇది మూడోసారి.

వరుసగా మూడో సారి ఆయన ఈ బాధ్యతలను చేపడుతున్నారు. ఇంకా జాతీయ ప్రధాన కార్యదర్శి గా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం పై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ… సిపిఎం పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకు వెళ్తానని స్పష్టం చేశారు. తామంతా ఏకధాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేశారు. కార్పోరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news