ఆ భారీ బడ్జెట్​ మూవీలో ప్రభాస్​కు జోడిగా మృణాల్‌ ఠాకూర్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

-

ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రాజెక్ట్‌ కె. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణె సందడి చేయనుంది. అయితే, ఈ సినిమాలో కథానాయిక పాత్రకు మొదట దీపికను అనుకోలేదట. మరో బాలీవుడ్‌ భామను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారట. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెతో ఎందుకు ప్రాజెక్ట్‌ కె చేయడం లేదు?

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్‌ సరసన కొత్త హీరోయిన్‌ ఉంటే బాగుంటుందని నాగ్ అశ్విన్‌ భావించారట. ఈమేరకు మృణాల్‌ ఠాకూర్‌ని ఎంచుకున్నారట. ఇదే సమయంలో దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన సీతారామం కథ విని.. ”ఈ ప్రేమకథకు మృణాల్‌ అయితే చక్కగా నప్పుతుంది. మీకు నచ్చితే ఆమెను ఈ సినిమాకు తీసుకోండి. నేను ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం మరో హీరోయిన్‌ను ఎంచుకుంటా” అని నాగ్‌ అశ్విన్‌ సూచించినట్లు నిర్మాత అశ్వనీ దత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా, మృణాల్‌ ‘సీతారామం’లో భాగమై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగువారికి అత్యంత సుపరిచితురాలైంది. మరోవైపు, ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెను నాగ్‌ అశ్విన్‌ ఫైనల్‌ చేశారు.

ఇక ఈ సీతారామం అనే అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్‌(రామ్‌)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news