సితార క్లాప్, నమ్రత స్విచ్ ఆన్.. సర్కారు వారి పాటకు ముహూర్తం ఫిక్స్..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… కీర్తి సురేష్ హీరోయిన్ గా.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నది . ఇక ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు జరగ్గా మహేష్ బాబు గారాలపట్టి సితార ఈ సినిమాకు క్లాప్ కొట్టింది.

ఇక మహేష్ బాబు సతీమణి నమ్రత కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది, 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news