మిస్టరీ డెత్.. జమ్మూలో ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు

-

ఓ ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించిన ఘటన జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అసలేం జరిగింది అంటే..?

మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్​ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్​ ఉల్​ హబీబ్​, సాజిద్​ అహ్మద్​గా గుర్తించారు. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా ఎవరైనా చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబం గురించి స్థానికులను ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అనుమానాస్పద మరణాలకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news