ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఏకంగా ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ దారుణమైన సంఘటన… కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో నీటి కుంటలో పడి ఏకంగా ఆరుగురు విద్యార్థులు మరణించడం జరిగింది.

స్కూల్ సమీపంలో ఉన్న నీటి కుంట దగ్గరకు ఆడుకోవడానికి విద్యార్థులు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారు ప్రమాదవశాత్తు.. అందులో పడిపోయారు. ఈ సంఘటనలో ఏకంగా ఆరుగురు మరణించడం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.