“మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభించనున్న మంచు ఫ్యామిలీ

-

మంచు మోహన్‌ బాబు కుటుంబానికి ఇటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అటు రాజకీయాల్లోనూ మంచి పేరు ఉంది. నటుడిగానే కాకుండా.. గతంలో ఎంపీగా కూడా మోహన్ బాబు పనిచేశారు. అంతేకాదు సమాజ సేవలోనూ మంచు మోహన్‌ బాబు కుటుంబంలో ఎప్పుడు ముందే ఉంటుంది. శ్రీ విద్యానికేతన్‌ పేరుతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచు ఫ్యామిలీ విద్యాసంస్థలను నడుపుతోంది.

అయితే.. తాజాగా మంచు మోహన్‌ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు తాజాగా మంచు మోహన్‌ బాబు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు మోహన్‌ బాబు.

“శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను” అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news