సీఎం జగన్ దేశద్రోహి…ఏపీలో తీవ్రవాదులు : సోము వీర్రాజు సంచలనం

-

సీఎం జగన్ దేశద్రోహి…ఏపీలో తీవ్రవాదులు ఉన్నారంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం క్షేత్రంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి షాపుల నిర్వహణలో ముస్లింలు చక్రం తిప్పేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ దేశద్రోహి…దేశ భక్తులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరులో వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాన్నాన్ని అడ్డుకుంటే బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి ని పై దాడి చేశారని.. శ్రీకాంత్ రెడ్డి పై ముస్లిం తీవ్రవాదులు చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు.

బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారని… హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టరా…అని నిలదీశారు. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు..జాతీయవాదులను పోలీసులు దుర్భాషలాడుతున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. కొన్ని రాష్ట్రాల్లో నిషేధించిన ఎస్డీపి ఐ వారు మంత్రిని కలుస్తారా…హిందువులపై ప్రభుత్వం కక్ష పూరిత వైఖరితో వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు..బీజేపీ కర్నూలు గడ్డ నుంచి సమరశంఖం పూరిస్తుందని.. ఏపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news